ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-08-14T20:23:04+05:30

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి ప్రభుత్వాలు శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి ప్రభుత్వాలు శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని, గతేడాది డిసెంబర్‌తో ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్సీ మండిపడింది. ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. నివేదిక అందించకపోతే తమ ముందు హాజరు కావాల్సి వస్తుందని సీఎస్‌లను హెచ్చరించింది.


తెలంగాణలో 2019 జాతీయ క్రైం రికార్డుల ప్రకారం 426 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. ఏపీలో ప్రభుత్వ క్రైం రికార్డుల ఆధారంగా 383 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడం లేదని శ్రావణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2021-08-14T20:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising