ఏపీలో కొత్తగా 262 కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-11-12T23:06:22+05:30
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 262 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,69,614 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 14,411 మరణాలు సంభవించాయి. ఏపీలో 3,227 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,51,976 మంది రికవరీ చెందారు.
Updated Date - 2021-11-12T23:06:22+05:30 IST