ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-01-17T21:32:40+05:30
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,85,985కి చేరిన
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,85,985కి చేరిన కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,140 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,896 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,76,949 మంది రికవరీ అయ్యారు. కొత్తగా విశాఖ జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.
మరోవైపు కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజున 19,025 (60.2%)మందికి టీకా వేశారు. తెలంగాణలో 4,296మందికిగాను 3,962 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఏపీలో తొలి వ్యాక్సిన్ను విజయవాడ జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ వర్కర్ బి.పుష్పకుమారికి జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శర్మిష్ట అందించారు. సీఎం జగన్ సమక్షంలో ఆమె టీకా వేయించుకున్నారు.
Updated Date - 2021-01-17T21:32:40+05:30 IST