సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి హేయం: నేరేళ్ల సురేష్
ABN, First Publish Date - 2021-12-21T19:22:46+05:30
ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్యనేత సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి చేయడం హేయమని జనసేన నేత నేరేళ్ల సురేష్ అన్నారు.
గుంటూరు: ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్యనేత సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి చేయడం హేయమని జనసేన నేత నేరేళ్ల సురేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..గుంటూరులో సుబ్బారావుపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పదవులు పొందిన ఆర్యవైశ్య నేతలు ఎందుకు పెదవి విప్పడం లేదని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు బలం ఉంటే పోలవరంపై, వైజాగ్ స్టీల్ ప్లాంట్పై పోరాటం చేయాలని కోరారు. ఆర్యవైశ్యులపై దాడి చేయడంతో మీ బలాన్ని నిరూపించుకోలేరన్నారు.దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేరేళ్ల సురేష్ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-12-21T19:22:46+05:30 IST