Nellore: ఓటీఎస్ కట్టాలంటూ ఒత్తిళ్లు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2021-12-12T13:50:16+05:30
ఓటీఎస్ వ్యవహారంతో పేదల కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. బలవంతం లేదంటూనే మెడపై కత్తి పెట్టినంత పని చేస్తు్న్నారు
నెల్లూరు: ఓటీఎస్ వ్యవహారంతో పేదల కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. బలవంతం లేదంటూనే మెడపై కత్తి పెట్టినంత పని చేస్తు్న్నారు. ఓటీఎస్ కట్టమంటూ ప్రజలపై..పంచాయతీ, సచివాలయాల సిబ్బంది తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వరికుంటపాడు (మ) తూర్పు కొండారెడ్డిపల్లిలో..ఓటీఎస్ ఒత్తిళ్లు తట్టుకోలేక గురవయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Updated Date - 2021-12-12T13:50:16+05:30 IST