CM YS Jagan పర్యటనలో మీడియాకు అవమానం..
ABN, First Publish Date - 2021-12-03T20:11:33+05:30
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు....
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటిస్తూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే.. జగన్ పర్యటనకు సంబంధించి వార్తలను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాను తీవ్రంగా అవమానించడం గమనార్హం. నిన్న, మొన్న పర్యటనలో కొన్ని టీవీ చానెల్స్, వార్తా పత్రికలకు అనుమతివ్వగా.. ఇవాళ ఏకంగా మీడియానే అవమానించారు.
సీఎం కాన్వాయ్ ముందుండే మీడియా వాహనాన్ని అతివేగంగా తీసుకెళ్లడంతో కెమెరామెన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాన్ని ఆపిన కెమెరామెన్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సీఎం వెంట ఉంటే ఇబ్బంది ఏంటి..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలో జగన్ పర్యటనలో చాలానే జరిగాయి.
Updated Date - 2021-12-03T20:11:33+05:30 IST