ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి

ABN, First Publish Date - 2021-04-24T04:19:34+05:30

మండలంలోని మర్రిపల్లి గ్రామంలో గిరిజన కాలనీకి చెందిన ఓ తల్లీకొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత రెండు రోజుల నుంచి వైద్యం అందక మృత్యువుతో పోరాడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మృత్యువుతో పోరాడుతున్న కుమారుడు


పొదలకూరు, ఏప్రిల్‌ 23 : మండలంలోని మర్రిపల్లి గ్రామంలో గిరిజన కాలనీకి చెందిన ఓ తల్లీకొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత రెండు రోజుల నుంచి వైద్యం అందక మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. తక్షణమే స్పందించిన అధికారులు నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించినా ఫలితం లేకపోయింది. వైద్యశాల సిబ్బంది ఆమెను చేర్చుకోకపోవడంతో మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు మేరకు.. తీవ్రంగా గాయపడ్డ తల్లీ, కుమారుడికి  వైద్యం అందించేందుకు మండల అధికారులు గురువారం రాత్రి గ్రామస్థులు రామకృష్ణ, జనార్దన్‌ సాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రి వారు అడ్మిట్‌ చేసుకోలేదు. దీంతో చేసేది లేక మరలా ఇంటికి రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చేశారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందకపోవడంతో తల్లి (కిష్టమ్మ) మృతి చెందింది. శుక్రవారం తహసీల్దారు, సీఐ, ఎస్‌ఐలు గాయపడ్డ కుమారుడు అంకయ్యను నెల్లూరు జీజీహెచ్‌కు సిఫార్సు ద్వారా పంపారు. కిష్టమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-04-24T04:19:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising