వలంటీర్లతో ప్రచారం తగదు
ABN, First Publish Date - 2021-04-13T05:19:46+05:30
వైసీపీ నాయకులు వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వినియోగించడం తగదని జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ అన్నారు.
వాకాడు, ఏప్రిల్ 12 : వైసీపీ నాయకులు వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వినియోగించడం తగదని జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ అన్నారు. వాకాడులో సోమవారం టీడీపీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రత్యేక హోదాపై పెదవి విప్పని వైసీపీ 22 మంది ఎంపీలను పెట్టుకుని ఏం చేస్తోందన్నారు. పనబాక లక్ష్మిని గెలిపిస్తే ప్రత్యేక హోదాతోపాటు స్థానిక సమస్యలపై పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పరిశీలకులు శేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-04-13T05:19:46+05:30 IST