విడవలూరులో లాక్డౌన్
ABN, First Publish Date - 2021-08-04T05:08:55+05:30
మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఉదయం 5నుంచి 10వరకు దుకాణాలు
ప్రజలు సహకరించాలని కోరిన అధికారులు
విడవలూరు, ఆగస్టు 3: మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దారు చంద్రశేఖర్, ఎంపీడీవో చిరంజీవి, స్థానిక ప్రజాప్రతినిధులు, దుకాణ దారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ తొలివిడతగా రామతీర్థం, ఊటుకూరు, విడవలూరులో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నందున ఆ ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 నుంచి 10 వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్డౌన్ సమయంలో ఎవరైనా బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ అధికారులు లాక్డౌన్ విధించిన గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Updated Date - 2021-08-04T05:08:55+05:30 IST