వైభవంగా లక్ష్మీనరసింహుడికి గరుడోత్సవం
ABN, First Publish Date - 2021-06-24T03:27:19+05:30
దగదర్తి మండలం తిరువీధిపాడులో వెలసి ఉన్న ఓబులేశు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలో బాగంగా బుధవారం రాత్రి గరుడవాహనంపై
బిట్రగుంట/దగదర్తి జూన్23: దగదర్తి మండలం తిరువీధిపాడులో వెలసి ఉన్న ఓబులేశు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలో బాగంగా బుధవారం రాత్రి గరుడవాహనంపై స్వామి వారు ఊరేగారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో స్వామిఅమ్మవార్ల ఊరేగింపు జరిగింది. స్వామివారి గరుడసేవ ఉభయకర్తలుగా స్థానిక సర్పంచి డప్పుసుగుణమ్మ రమణయ్య దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నల్లగట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-24T03:27:19+05:30 IST