గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్రగాయాలు
ABN, First Publish Date - 2021-01-14T04:36:41+05:30
మేనకూరు సెజ్లోని కోనేటిరాజుపాళెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
నాయుడుపేట టౌన్, జనవరి 13 : మేనకూరు సెజ్లోని కోనేటిరాజుపాళెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలాయపల్లి మండలం గొల్లగుంటకు చెందిన కోటి మేనకూరు సెజ్లో పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం బైక్పై స్వగ్రామం నుంచి కర్మా గారానికి వస్తుండగా కోనేటిరాజుపాళెం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కోటిని తిరుపతికి తరలించారు.
మోటారు బైక్ను ఢీకొన్న కారు
పెళ్లకూరు : చిల్లకూరు-వడ్డిపాళెం గ్రామం వద్ద బుధవారం ఉదయం హైవే పై బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో మల్లి చెంచయ్య, బండి అంకయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. చిల్లకూరు వడ్డిపాళెంకు చెందిన మల్లి చెంచయ్య, బండి అంకయ్య బుధవారం ఉదయం బైక్పై నాయుడుపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని నెల్లూరుకు తర లించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-01-14T04:36:41+05:30 IST