అబ్దుల్ కలాంకు ఘన నివాళి
ABN, First Publish Date - 2021-07-28T05:29:00+05:30
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం అబ్దుల్ కలాం వర్ధంతి జరిపారు. ఆయన చిత్రపటానికి పుష్పమాలలు వేసి దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
నెల్లూరు(సాంస్కృతికం), జూలై 27 : భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం అబ్దుల్ కలాం వర్ధంతి జరిపారు. ఆయన చిత్రపటానికి పుష్పమాలలు వేసి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే లయన్స్క్లబ్ ఎడ్యుకేషనల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ఎం హైస్కూలులో అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా పలువురు విద్యార్థులు పాల్గొని మిస్సైల్ మ్యాన్కు నివాళులర్పించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ ఎడ్యుకేషనల్ కమిటీ చైౖర్మన్ నితీష్కుమార్, కార్యదర్శి సతీష్కుమార్ పర్యవేక్షించారు.
Updated Date - 2021-07-28T05:29:00+05:30 IST