ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరని కష్టం..

ABN, First Publish Date - 2021-12-01T04:48:10+05:30

వరుణుడు కరుణించాడు. మంగళవారం నాటికి వర్షం నిలిచింది. అయినప్పటికీ వాగులు, వంకల ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు.

కృష్ణపట్నం పోర్డు క్రాస్‌రోడ్డు వరకు నిలిచి ఉన్న ట్రాఫిక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పని ట్రాఫిక్‌ వెతలు

వేలాది ఎకరాల నీటమునక

నీటిలోనే దళిత, గిరిజన కాలనీలు  

మూడురోజులుగా రోడ్లపైనే పోలీసులు


మనుబోలు, నవంబరు 30: వరుణుడు కరుణించాడు. మంగళవారం నాటికి వర్షం నిలిచింది. అయినప్పటికీ వాగులు, వంకల ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు. చెరువుల్లోనూ అదే జోరు..అదే హోరు. ఎగువ నుంచి ఏకధాటిగా వస్తున్న వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇక వేలాది ఎకరాల వరి పొలాల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.  వాగులు, వంకలు పక్కనే ఉన్న దళిత, గిరిజన కాలనీలు రెండు రోజులుగా జలదిగ్బంధలోనే ఉన్నాయి. జాతీయ రహదారి అయితే మూడురోజులుగా ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. సాయంత్రానికి ఆదిశంకర కళాశాల వద్ద రోడ్డుపై వరద స్వల్పంగా తగ్గడంతో పోలీసులు భారీ వాహనాలను పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆదిశంకర కళాశాల నుంచి కాకుటూరు వరకు వేలాది వాహనాలు బారులు తీరాయి. మూడు రోజులుగా కంటిమీద కునుకులేకుండా రేయింబవళ్లు గూడూరు, మనుబోలు, చిల్లకూరు, నెల్లూరు పోలీసులు రోడ్లపై ఉంటూ వాహనాలు వెళ్లేందుకు చర్యలు చేపడుతున్నారు.  నవంబరులోనే వరుసపెట్టి వర్షాలు కురిసి ఇంతగా ఈ ఏడాదే నష్టపోయారని పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-12-01T04:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising