టీడీపీ సీనియర్ నేత కృష్ణమూర్తి కన్నుమూత
ABN, First Publish Date - 2021-05-12T05:22:50+05:30
టీడీపీ సీనియర్ నాయకుడు పడవల కృష్ణమూర్తి మంగళవారం కన్నుమూశారు.
1 అమర్ 11 : టీడీపీ సీనియర్ నేత పడవల కృష్ణమూర్తి
నెల్లూరు, మే 11, (ఆంధ్రజ్యోతి) : టీడీపీ సీనియర్ నాయకుడు పడవల కృష్ణమూర్తి మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. టీడీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శిగా, 47వ డివిజన్ ఇన్చార్జ్గా పనిచేశారు. కృష్ణమూర్తి మరణంపై మాజీ మంత్రి, పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సిటీ ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారనుకున్న ఆయన ఆకస్మికంగా మృతి చెందడం విచారకరమని తెలిపారు. క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన సీనియర్ నాయకుడిని పార్టీ కోల్పోయిందన్నారు. పడవల కృష్ణమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2021-05-12T05:22:50+05:30 IST