అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజల ఆకాంక్ష: Devineni
ABN, First Publish Date - 2021-11-27T19:45:47+05:30
అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
నెల్లూరు: అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుకే మహాపాదయాత్ర అందరి మద్దతుతో చాలా బాగా కొనసాగుతోందని తెలిపారు. ఏబీఎన్తో మాట్లాడుతూ మహాపాదయాత్రకు రాళ్లేస్తారని ప్రభుత్వం అందని...అయితే ప్రజలు పూలవర్షం కురిపిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం 250 మంది బలిదానమయ్యారని తెలిపారు. రాజధాని విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడటం సరికాదని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-11-27T19:45:47+05:30 IST