స్వర్ణ హనుమంతుడిపై శ్రీరాముడిగా నృసింహుడు
ABN, First Publish Date - 2021-04-22T04:00:25+05:30
శ్రీరామ నవమి పురస్కరించుకుని పెంచల నృసింహుడు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు
రాపూరు, ఏప్రిల్ 21: శ్రీరామ నవమి పురస్కరించుకుని పెంచల నృసింహుడు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆలయంలో పూజలు చేశారు. రామావతారంలో శ్రీవారి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం స్వర్ణహనుమంత వాహనంపై నృసింహుడిని కొలువుదీర్చి ఆస్థానసేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవార్లను దర్శించుకున్నారు.
Updated Date - 2021-04-22T04:00:25+05:30 IST