స్పందనతో సమస్యల పరిష్కారం
ABN, First Publish Date - 2021-07-27T03:28:42+05:30
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక మున్సిఫల్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
వెంకటగిరి(టౌన్), జూలై 25: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక మున్సిఫల్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వర పరిష్కరిస్తున్నామని అన్నారు. అన్ని సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించేందుకు యోచిస్తున్నామని తెలిపారు.. అనంతరం ఆయన 10వ నెంబరు సచివాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది ఎవరు లేకపోవడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, వైస్చైర్మన్ చింతపట్ల ఉమామహేశ్వరి, కమిషనర్ మధుకిరణ్ రెడ్డి, మేరువ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-27T03:28:42+05:30 IST