వార్డుమెంబర్లు, ఉపసర్పంచుల శిక్షణ ప్రారంభం
ABN, First Publish Date - 2021-10-26T03:53:11+05:30
పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 30 పంచాయతీలకుగాను 8 పంచాయతీల వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు శి
పొదలకూరు, అక్టోబరు 25 : పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 30 పంచాయతీలకుగాను 8 పంచాయతీల వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు శిక్షణను సోమవారం ఎంపీడీవో సుజాత, ఈవోపీఆర్డీ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీపీవో ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సమస్యలపై వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్పంచుల సమన్వ యంతో గ్రామాల అభివృద్ధికి కలిసి పని చేయాలన్నారు. గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. అనంతరం ట్రైనర్లు వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు వారి హక్కులు, విధులు, జాబ్చార్ట్ గురించి వివరించారు. కార్యక్రమంలో నిమ్మళ్ల విజయమ్మ, వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు తెనాలి నిర్మలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-26T03:53:11+05:30 IST