ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శెభాష్‌

ABN, First Publish Date - 2021-05-09T03:28:05+05:30

పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కరోనా బాధితులకు సేవలందిస్తూ మన్ననలు పొందుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులకు ప్రా

: కోవూరు ప్రభుత్వ వైద్యశాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మన్ననలు పొందుతున్న ప్రభుత్వ వైద్యులు

కోవూరు, మే7 : పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కరోనా బాధితులకు సేవలందిస్తూ మన్ననలు పొందుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులకు ప్రాథమిక వైద్యం అందించి నెల్లూరులోని కొవిడ్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. స్వల్ప ప్రభావమున్న రోగులకు ఐసోలేషన్‌ కేంద్రంలోనే వైద్య సహాయం అందచేస్తున్నారు. వైద్యశాలలలో తగినంత సిబ్బంది లేకపోయినా రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ యూసఫ్‌  ఫోన్‌లో వైద్యసహాయం కోరిన హోమ్‌ఐసోలేషన్‌ రోగులకు కూడా ఓపికగా సమాధానం ఇస్తున్నారు. రెండు రోజుల కిందట పల్స్‌ శాతం పడిపోయిన ఏడుగురు కరోనా వ్యాధిగ్రస్థుల్ని కాపాడేందుకు డాక్టర్‌ యూసఫ్‌ హుటాహుటిన నెల్లూరుకి వెళ్లి  జేసీ బాపిరెడ్డి మాట్లాడి ఆక్సిజన్‌ను  అందుబాటులోకి తెచ్చారు. దీంతో కరోనా రోగులు, బంధుమిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సేవాభావాన్ని చాటుకుం టున్న వైద్యులకు, సిబ్బందికి స్ధానికులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. 


Updated Date - 2021-05-09T03:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising