ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధులకు రాని ముగ్గురికి మెమోలు

ABN, First Publish Date - 2021-06-20T03:16:45+05:30

మండలంలోని అక్కంపేట సచివాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు తహసీల్దార్‌ నాగరాజు శనివారం మెమోలు జారీ చేశారు. 11గంటలవు

అక్కంపేట సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న తహసీల్దార్‌ నాగరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మనుబోలు, జూన్‌ 19: మండలంలోని అక్కంపేట సచివాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు తహసీల్దార్‌ నాగరాజు శనివారం మెమోలు జారీ చేశారు. 11గంటలవుతున్నా సచివాలయానికి ఉద్యోగులు ఎవరూ రాకపోవడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో గ్రామస్థులు సోషల్‌మీడియాలో ‘తెరుచుకోని సచివాలయం’ అంటూ పోస్టింగ్‌లు పెట్టారు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌  హుటాహుటిన అక్కంపేట సచివాలయం చేరుకున్నారు. అక్కడ మహిళాపోలీసు మినహా ఉద్యోగులెవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుపట్టి పరిశీలించి ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సెలవుపెట్టకుండా విధులకు హాజరుకాని ముగ్గురు ఉద్యోగులకు మెమోలు ఇచ్చారు. మరోసారి ఇలా జరిగితే ఉన్నతాధికారులకు తెలిపి కఠిన చర్యలు ఉంటాయని  ఆదేశించారు.  కార్యక్రమంలో వీఆర్‌వో జమునమ్మ, కార్యదర్శి వెంకటరమణలు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T03:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising