మహిళ నుంచి రూ. 50వేల చోరీ
ABN, First Publish Date - 2021-07-27T04:12:48+05:30
నాయుడుపేటలో ఓ మహిళ వద్ద గుర్తు తెలియని వారు రూ. 50వేలను అపహరించారు.
నాయుడుపేట టౌన్, జూలై 26 : నాయుడుపేటలో ఓ మహిళ వద్ద గుర్తు తెలియని వారు రూ. 50వేలను అపహరించారు. బాధితురాలి కథనం మేరకు పెళ్లకూరు మండలం దిగువచావాలి గ్రామానికి చెందిన శ్రీపతి ధనలక్ష్మి తన కుమార్తెతో కలసి సోమవారం నాయుడుపేటకు వచ్చింది. పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంక్లో రూ. 50వేలు డ్రాచేసుకొని తన వద్ద ఉన్న కర్రల సంచిలోని కవరులో పెట్టింది. తల్లీ కూతుళ్లు బజారులో పలు దుకాణాల వద్ద వస్తువులు కొనుగోలు చేసి స్వగ్రామానికి వెళ్లేందుకు అమరావతి సెంటర్ వద్దకు ఆటో ఎక్కేందుకు వచ్చారు. ఆ సమయంలో నగదును పరిశీలించుకోగా కర్రల సంచికి, నగదు ఉన్న కవరుకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పరిశీలించగా 50వేలు కనిపించలేదు. సొమ్ము చోరీకి గురైనట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ధనలక్ష్మి ఫిర్యాదు చేసింది.
Updated Date - 2021-07-27T04:12:48+05:30 IST