ఏపీ ఆర్ఎస్ఏ డివిజన్ అధ్యక్షుడిగా రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక
ABN, First Publish Date - 2021-10-25T04:28:10+05:30
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ ఆర్ఎస్ఏ) నాయుడుపేట డివిజన్ అధ్యక్షుడిగా సూళ్లూరుపేట తహసీల్దారు కె. రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాయుడుపేట టౌన్, అక్టోబరు 24 : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ ఆర్ఎస్ఏ) నాయుడుపేట డివిజన్ అధ్యక్షుడిగా సూళ్లూరుపేట తహసీల్దారు కె. రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయుడుపేట ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు కటారి జయజయరావు, పెళ్లూరు గోపీనాథ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో రెవెన్యూ ఉద్యోగులు రవికుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షుడిగా పెళ్లకూరు డీటీ ఎన్, శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా పి. శిరీష, ఎం. నాగేంద్రబాబు, ఎస్కె. వజీద్, కార్యదర్శిగా ఎన్. పవన్కుమార్, సహకార్యదర్శులుగా కె. చందు, నాగార్జున, ఎస్కె సైరాభాను, కోశాధికారి డి. నిరంజన్బాబు, ఈసీ సభ్యులుగా సీహెచ్. హేమంత్సాద్విక్ బి. ప్రభాకర్, జిల్లా కౌన్సిలర్లుగా వై. ప్రమీలా, పి. శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని రెవెన్యూ ఉద్యోగులు పూలమాలలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
Updated Date - 2021-10-25T04:28:10+05:30 IST