రంగడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా గుంజ ప్రతిష్ఠ
ABN, First Publish Date - 2021-03-02T05:18:51+05:30
తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు నాంది పలుకుతూ ఆలయంలో సోమవారం గుంజ ప్రతిష్ఠ వేడుక జరిగింది.
నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 1 : తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు నాంది పలుకుతూ ఆలయంలో సోమవారం గుంజ ప్రతిష్ఠ వేడుక జరిగింది. ప్రధాన అర్చకుడు కిడాంబి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, ఈవో డీ వెంకటేశ్వర్లు, ధర్మకర్త పిగిలం సుధీర్, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Updated Date - 2021-03-02T05:18:51+05:30 IST