రాజారెడ్డి అరెస్టు చేస్తే... అంబేద్కర్ వదిలి పెట్టాడు!
ABN, First Publish Date - 2021-10-26T03:46:25+05:30
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని రాజారెడ్డి రాజ్యంగం అరెస్టు చేస్తే...అబేంద్కర్ రాజ్యాంగం విడుదల చేసిందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల
వెంకటగిరి, అక్టోబరు 25: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని రాజారెడ్డి రాజ్యంగం అరెస్టు చేస్తే...అబేంద్కర్ రాజ్యాంగం విడుదల చేసిందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బతికుంది అనడానికి పట్టాబి విడుదలే నిదర్శన మన్నారు. రాష్ట్రంలో జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. బోసడికే అన్న పదం సాకుతో పట్టాభి ఇంటిని, టీడీపీ కార్యాలయాన్ని, కిరాయి గూండాలతో ధ్వంసం చేయించడమే కాకుండా ఆయనను అరెస్టు చేశారన్నారు. బోసడికే అన్న బ్రాండుతో మద్యం విడుదల చేసిన ముఖ్యమంత్రిని ఏజైల్లో పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ కార్యాలయాలు ధ్వంసం చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన దీక్షకు పోటీగా, వైసీపీ జనంలేని జనాగ్రహ దీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. అగ్రహం అంటే ముఖ్యమంత్రి జగన్కు అర్థం తెలియలేదని ఆయన నేరుగా జనాల్లోకి వస్తే జనాగ్రహం ఎలా ఉంటుండో అర్థమవుతుందన్నారు. వైసీపీ చేస్తున్న ఈ అరాజకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీరామదాసు గంగాధర్, మండల పార్టీ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, నాయకులు టీవీఆర్, గెరిటి చెంచయ్య, పులికొల్లు రాజేశ్వరరావు, పోలంరెడ్డి కోటిరెడ్డి, గల్లా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-26T03:46:25+05:30 IST