ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షంలోనూ పేదలకు ఆహారం

ABN, First Publish Date - 2021-12-01T04:43:14+05:30

భారీ వర్షంలో కూడా నిరుపేదల ఆకలి తీర్చిన అన్నదాతలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

గిరిజనులకు ఆహారం పంపిణీ చేస్తున్న ఇమ్మానుయేల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటపల్లిగూడూరు. నవంబరు 30 : భారీ వర్షంలో కూడా నిరుపేదల ఆకలి తీర్చిన అన్నదాతలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ముత్తుకూరు మండలం నేలటూరు కాలువ గట్టుపై సుమారు 50 నిరుపేద చల్లా యానాదుల కుటుంబాలు జీవిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కూలి పనులు లేకపోవడంతో వీరంతా గత పది రోజులుగా ఆహారానికి నోచుకోకుండా పోయారు. సమాచారం అందుకున్న తోటపల్లిగూడూరు మండలం తోటపల్లి పంచాయతీ కామాక్షినగర్‌లోని ఫెల్లోషిప్‌ ఆఫ్‌ గాడ్‌ సంస్థ కన్వీనర్‌ కుందవరం బాబీ ఇమ్మానుయేల్‌ భారీ వర్షంలో  సోమవారం రాత్రి భోజనాలు సిద్ధం చేసుకుని వెళ్లి స్వయంగా వడ్డించారు.అనంతరం ఆ కుటుంబాలకు వారం రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. గిరిజనులను ఆదుకున్న సంస్థ కన్వీనర్‌ను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

Updated Date - 2021-12-01T04:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising