పోర్టు భూమి పంచేశారు!
ABN, First Publish Date - 2021-07-28T04:49:56+05:30
జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం పరిధిలోని 209.25 ఎకరాల కృష్ణపట్నం పోర్టు భూములను రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరిట బదలాయింపు చేశారు.
209 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు..
కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు
గూడూరు ఆర్డీవో విచారణలో వెలుగులోకి
తహసీల్దారు, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ల సస్పెన్షన
నెల్లూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం పరిధిలోని 209.25 ఎకరాల కృష్ణపట్నం పోర్టు భూములను రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరిట బదలాయింపు చేశారు. సుమారు 5 కోట్ల రూపాయలు విలువచేసే ఈ భూకుంభకోణం వెలుగులోకి రావడంతో సంబంధిత తహసీల్దారు, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్పై సస్పెన్షన వేటు వేస్తూ కలెక్టర్ చక్రధర్బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ్మినపట్నం పరిధిలో సర్వే నెం.94-3లో దేవదాయశాఖ భూములను 2011లో భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం ఇండసీ్ట్రయల్ కారిడార్కు సేరించింది. అందులో 271.80 ఎకరాలను డైరెక్టర్ పోర్టు పేరిట బదలాయించింది. అప్పటి నుంచి ఆ భూములు కృష్ణపట్నంపోర్టు ఆధీనంలో ఉన్నాయి. కాగా అందులో 209.25 ఎకరాలను 11మంది వ్యక్తులపై ఈ ఏడాది మార్చిలో ఆనలైనలో మార్పులు చేశారు. కొనుగోలు ద్వారా వారికి భూములు సంక్రమించినట్లు రికార్డులో పేర్కొంటూ వెబ్ల్యాండ్లో మార్పు చేసి 1బీ, అడంగల్ సృష్టించారు. అలానే ఈ మార్పులకు సంబంధించి ఈసీ ఇవ్వాల్సిందిగా తహసీల్దారు గీతావాణి గూడూరు సబ్రిజిసా్ట్రర్ కార్యాలయానికి ఉత్తర్వులు కూడా పంపారు. ఈ క్రమంలో ఈ అక్రమాలను పోర్టు యాజమాన్యం గుర్తించింది.
పోర్టు యాజమాన్యం ఫిర్యాదుతో..
జరుగుతున్న తతంగంపై పోర్టు అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ విచారణ జరిపి భూకుంభకోణం వాస్తవమేనని తేల్చారు. ఆర్డీవో తన విచారణ నివేదికను కలెక్టర్ చక్రధర్బాబుకు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా తహసీల్దారు గీతావాణి ఆర్ఐ సిరాజ్, కంప్యూటర్ ఆపరేటర్ నవీనను సప్పెండ్ చేసూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెర వెనుక అధికార పార్టీ నేతలు?
కాగా ప్రభుత్వం కోస్టల్కారిడార్ కోసం భూసేరణ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన లావాదేవీల ప్రకారం చూస్తే తమిన్నపట్నం గ్రామంలో ఎకరాకు సుమారు రూ. 25లక్షల వరకు పరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే కొంత మంది అధికార పార్టీ నేతలు ఈ భూకుంభకోణానికి తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరైతే 11మంది వ్యక్తులు ఉన్నారో వారంతా కనీసం చిల్లకూరు మండలానికి సబంధించినవారు కూడా కాకపోవడం గమనార్హం. అయితే ఇంత జరుగుతున్నా భూములు తమవని తహసీల్దారుకు దరఖాస్తుచేసుకున్న 11మంది వ్యక్తులు ప్రస్తుతం బయటకు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా వెబ్ల్యాండ్లో మార్పునకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని రిజిసే్ట్రషనల డాక్యుమెంట్లు సమర్పించాల్సి వుంటుంది. ప్రస్తుతం ఇది కుంభకోణం అని తేలడంతో ఆ డాక్యూమెంట్లన్నీ నకిలీవని తెలిపోయింది. మరి నకిలీపత్రాలు సృష్టించి పోర్టు భూములు తమవంటూ దరఖాస్తు చేసుకున్నవారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
Updated Date - 2021-07-28T04:49:56+05:30 IST