ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొదుపు నగదు స్వాహాపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-10-26T03:38:13+05:30

మండలంలోని పూడిపర్తి లో పొదుపు నగదు స్వాహాపై సోమవారం వెంకటాచలం పోలీసులకు డీఆర్‌డీఏ ఏరియా కో-ఆర్డినేటర్‌

కుడుముల రాధమ్మ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, అక్టోబరు 25 : మండలంలోని పూడిపర్తి లో పొదుపు నగదు స్వాహాపై సోమవారం వెంకటాచలం పోలీసులకు డీఆర్‌డీఏ ఏరియా కో-ఆర్డినేటర్‌ కనుపూరు శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పూడిపర్తికి చెందిన కుడుముల రాఽధమ్మ  కొంత కాలం నుంచి పొదుపు గ్రూపు ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తోంది.  ఆమె స్థానికంగా ఉన్న అభినయ పొదుపు గ్రూపు ద్వారా రూ.27,500, శ్రీగౌరీ పొదుపు గ్రూపు ద్వారా రూ.10,500, శ్రీసాయి పొదుపు గ్రూపు ద్వారా రూ.16,500, గణేష్‌ పొదుపు గ్రూపు ద్వారా రూ.1,59,000, పార్వతి పొదుపు గ్రూపు ద్వారా రూ.3,13,632లను, మొత్తం ఐదు పొదుపు గ్రూపుల నుంచి రూ.6,21,632ల నగదు స్వాహా చేసినట్లు తమ విచారణ తేలిందన్నారు. వీటితోపాటు మరికొంత స్ర్తీనిధి నగదు కూడా ఉందన్నారు. పొదుపు నగదును ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయడమే కాకుండా సభ్యులను నమ్మించి మోసం చేసిందన్నారు. రాధమ్మపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, పొదుపు మహిళల సొమ్మును తిరిగి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.




Updated Date - 2021-10-26T03:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising