ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-09-18T03:48:41+05:30

వెంకటేశ్వరపురం గిరిజనకాలనీ సమీపంలోని పొలాల్లో గురువారం సాయంత్రం కలవగుంట పోలయ్య(30) అనే యువకుడు మృతి చెందాడు.

పోలయ్య మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డక్కిలి, సెప్టెంబరు 17 : వెంకటేశ్వరపురం గిరిజనకాలనీ సమీపంలోని పొలాల్లో గురువారం సాయంత్రం కలవగుంట పోలయ్య(30) అనే యువకుడు మృతి చెందాడు. ఇతని మృతిపై  బిన్నకథనాలు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం వెంకటేశ్వరపురం గ్రామంలో గిరిజన మహిళతో పోలయ్య అసభ్యంగా ప్రవర్తించాడు, దీంతో ఆమె బంధువులు అతడిపై దాడి చేసినట్లు గిరిజనవాడవాసులు చెబుతున్నారు. ఆ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో సమీపంలోని పొలంలోకి పారిపోయాడు. అతడిని వెంబడించిన ముగ్గురు యువకులు అతడిని బలవంతంగా పొలానికి అమర్చిన సోలార్‌ కంచెపై పడేయడంతో అతను మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  విషయం తెలుసుకొన్న డక్కిలి పోలీసులు హూటాహూటిన సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ముగ్గురు గిరిజన యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సోలార్‌ ఫెన్సింగ్‌ కారణంగా మృతిచెందాడా? లేదా తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-09-18T03:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising