పచ్చని చెట్టు నరికివేత
ABN, First Publish Date - 2021-07-17T03:43:30+05:30
ఇందుకూరుపేట పట్టణ నడి బజారులో పాతికేళ్లకు పైగా అందరికి నీడనిచ్చి, స్వేద తీరుస్తున్న పచ్చని చెట్టు ఈరోజు ఇద్దరు వైసీపీ నాయకుల స్వార్థానికి బలైపోయింది.
వైసీపీ నేతల ఆదాయ వనరుకు బలి
ఇందుకూరుపేట, జూలై 16 : ఇందుకూరుపేట పట్టణ నడి బజారులో పాతికేళ్లకు పైగా అందరికి నీడనిచ్చి, స్వేద తీరుస్తున్న పచ్చని చెట్టు ఈరోజు ఇద్దరు వైసీపీ నాయకుల స్వార్థానికి బలైపోయింది. కేవలం స్వార్థం, ఎవరు అడగరు అన్న ధీమాతో తల్లిలాంటి ఆ పచ్చని చెట్టు వారికి ఆదాయ వనరుగా మారింది. నడిబజారులో సినిమా హాల్ ఎదురుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి విగ్రహం పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఎదురుగా అందులోనూ ఎస్సై ఇంటి ఎదురుగానే ఈ చెట్టును అక్రమంగా నరికివేశారు. ఈ విషయంపై గ్రామస్థులు ఆర్అండ్బీ ఇంజనీరుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తాము పరిశీలిస్తామని వైసీపీ నాయకులు అయినా ఉపేక్షించేది లేదని వారు తెలియజేశారు.
Updated Date - 2021-07-17T03:43:30+05:30 IST