రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN, First Publish Date - 2021-01-16T05:15:18+05:30
కారు ఢీ కొన్న ప్రమాదంలో మోటారు సైకిలిస్టు అక్కడిక్కడే మృతి చెందాడు.
తడ, జనవరి 15 : కారు ఢీ కొన్న ప్రమాదంలో మోటారు సైకిలిస్టు అక్కడిక్కడే మృతి చెందాడు. తమిళనాడులోని గుమ్మిడిపూడి తాలూకా ఆతుపాకం గ్రామానికి చెందిన ఆరపరెడ్డి శంకర్ (45) సంక్రాంతికి పూడి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం సొంతపని కోసం మోటారుసైకిల్పై పెదపూడి వరకు వచ్చి తిరిగి పయనమయ్యాడు. మార్గ మధ్యంలో పూడి జాతీయ రహదారి మలుపువద్ద చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేటకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-01-16T05:15:18+05:30 IST