ఒకే గదిలో 20 కుటుంబాలు
ABN, First Publish Date - 2021-12-29T03:55:18+05:30
పెన్నా ముంపు బాధితులు ఇంకా అనేక వ్యధలను చవిచూస్తున్నారు. వరద ముప్పు తొలగి 40 రోజులు కావస్తున్నా మండలంలోని పల్లెపాడులో చల్లా యానాదులు దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్నారు.
దుర్భరస్థితిలో చల్లా యానాదులు
కనీస వసతుల కరువు
పట్టించుకోని అధికారులు
ఇందుకూరుపేట, డిసెంబరు 28 : పెన్నా ముంపు బాధితులు ఇంకా అనేక వ్యధలను చవిచూస్తున్నారు. వరద ముప్పు తొలగి 40 రోజులు కావస్తున్నా మండలంలోని పల్లెపాడులో చల్లా యానాదులు దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్నారు. వీరి నివాసాలు వరద ముంపులో కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా ఓ నిర్మాణంలో ఉన్న సచివాలయంలో 20 కుటుంబాలకు నివాసం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ వారు ఆ ఒక్క గదిలోనే మగ్గుతున్నారు. ప్రధాన వసతులైన నీరు, మరుగుదొడ్లు లేకపోవడంతో అపరిశుభ్రత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. ఆరు వారాలు అవుతున్నా వీరి వసతి గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వారికి విముక్తి కలిగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - 2021-12-29T03:55:18+05:30 IST