ఆనందయ్య మందుకు రాజకీయ గ్రహణం
ABN, First Publish Date - 2021-06-10T18:24:22+05:30
ఆనందయ్య మందుకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఉచిత మందు పంపిణీకి అవాంతరాలు ఎదురవుతున్నాయి.
నెల్లూరు: ఆనందయ్య మందుకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఉచిత మందు పంపిణీకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. అన్ని జిల్లాల్లో పంపిణీకి సహాకారం అందివ్వాలని సీఎం జగన్, గవర్నర్లకి ఆనందయ్య లేఖలు రాసినా స్పందన కరవైంది. ఆనందయ్యతో మందు తయారు చేయించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పోటీపడుతున్నారు. తమకే ముందుగా మందు తయారీ చేయించాలంటూ పోటీకి దిగారు. మందు తయారీ విషయంలో వైసీపీలో విభేదాలు చోటు చేసుకుంటున్నారు. రెండు రకాల మందులు తయారు చేశారని వైసీపీ ముస్లిం మైనార్టీ నేత సమీ అన్నారు. ఉచితంగా మందు పంపిణీ చేస్తుండగా అనుమతులు లేవని అధికారులు అడ్టుకుంటున్నారని...ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే అని సమీ ఆరోపించాు. ఆనందయ్య మందుకి గిరాకీ ఉండటంతో ఇదే అదునుగా కేటుగాళ్లు రూ.వేలకి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం నెలకొంది.
Updated Date - 2021-06-10T18:24:22+05:30 IST