మిర్యాలగూడలో దొంగల బీభత్సం..రూ. 8 లక్షలు అపహరణ
ABN, First Publish Date - 2021-02-27T18:08:46+05:30
జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంతోష్నగర్లో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి రూ. 8 లక్షల 50 వేల నగదు, మూడు తులాల బంగారు ...
నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంతోష్నగర్లో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి రూ. 8 లక్షల 50 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-02-27T18:08:46+05:30 IST