ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన భోజనం అందించాలి : ఎంపీపీ

ABN, First Publish Date - 2021-12-10T03:16:58+05:30

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. ఆమె గురువారం స్థానిక ఆదర్శ పాఠశా

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎంపీపీ పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతారామపురం, డిసెంబరు 9: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. ఆమె గురువారం స్థానిక ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, నీటి వసతిపై ఆరా తీశారు. విద్యార్థులు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆమె వారం రోజుల్లో ఆ సమస్య తీరుస్తామన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.  అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీపీని సన్మానించా రు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్‌వలి, మండల వైసీపీ కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 


 అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలి


మండలంలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి పేర్కొన్నారు. ఆమె గురు వారం స్థానిక అక్షరవెలుగు విద్యా ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చెరుకుపల్లి రమణారెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ సుబ్బారెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చప్పిడి తిరుపతిరెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్‌ రామ్మోహన్‌రావు, మండల కో ఆర్డినేటర్లు ఎంవీ సుబ్బమ్మ, హైమావతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-10T03:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising