ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ముగిసిన దేవీ శరన్నరాత్రులు

ABN, First Publish Date - 2021-10-20T04:52:24+05:30

మనుబోలులో సోమవారం అర్ధరాత్రి దుర్గాదేవిని భారీగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు.

మహంకాళి అలంకరణలో మనుబోలులో గ్రామోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుబోలు, అక్టోబరు 19: మనుబోలులో సోమవారం అర్ధరాత్రి దుర్గాదేవిని భారీగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. దీంతో దేవీ శరన్నరాత్రులు ఘనంగా ముగిశాయి. 11రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి ప్రత్యేక పూజలు, ఉభయాలు నిర్వహించారు. గజమాలలతో మనుబోలులో, కోదండరామపురంలో దుర్గాదేవిని మహంకాళి అవతారంలో అలంకరించారు. విద్యుద్దీపాల నడుమ, బాణసంచాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా మంగళవారం వరకు మనుబోలులో వీధుల్లో సాగాయి. చావిడిలో అమ్మవారి ముందు ఉంచిన లడ్డును వేలం  వేశారు.  రెండుచోట్ల నిర్వాహకులు గ్రామోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  గ్రామోత్సవం ముగిశాక కలిశోద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. 



Updated Date - 2021-10-20T04:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising