ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంను తిడితే కార్యకర్తలు ఊరుకుంటారా..?

ABN, First Publish Date - 2021-10-24T03:28:26+05:30

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తిడితే ఉప్పు కారం ఎక్కువగా తినే గుంటూరు కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు(జడీ ్ప), అక్టోబరు 23 : సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తిడితే ఉప్పు కారం ఎక్కువగా తినే గుంటూరు కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. నగరంలోని 10వ డివిజన్‌ కోదండరామపురం రాంనగర్‌ ప్రాంతాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టించిన చంద్రబాబునాయుడు దొంగ దీక్షలు చేస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. తండ్రీ కొడుకులను ప్రజలు తరిమి కొట్టడం తథ్యమన్నారు. డ్రగ్స్‌ విషయంలో ఏపీకి సంబంధం లేదని కేంద్రం పదేపదే చెబుతున్నా రాష్ట్ర ప్రజలు డ్రగ్స్‌లో మునిగి తేలుతున్నారని చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు మాట్లాడుతుండడం దౌర్భాగ్యం అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 10వ డివిజన్‌కు చెందిన టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడు పత్తి మల్లికార్జున, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దార్ల బాబు తమ అనుచరులతో శనివారం మంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కిన్నెర ప్రసాద్‌, దేవరాల సుబ్రహ్మణ్యం, కిన్నెర ప్రేమ్‌కుమార్‌, శేషు గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T03:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising