ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-03T04:59:39+05:30

మండలంలోని సర్వేపల్లి సమీపంలో ఓ బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉరివేసుకుని మృతి చెందిన నిమియా సబర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, మార్చి 2 : మండలంలోని సర్వేపల్లి సమీపంలో ఓ బీరు  ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రంలోని పార్లకేముంది గజపతి జిల్లా పరసంబ గ్రామానికి చెందిన నిమియా సబర్‌ (25) సర్వేపల్లి సమీపంలోని బీరు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. మృతుడు ఫ్యాక్టరీ సమీపంలోనే ఓ గదిలో ఉంటున్నాడు. అయితే తన తోటి వారితో వచ్చిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా   రెండు రోజులుగా ఫ్యాక్టరీకి సెలవు పెట్టి,  పూటుగా మద్యం సేవించాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి తన గదిలో ఉరివేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంకటాచలం ఎస్‌ఐ షేక్‌ కరీముల్లా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-03-03T04:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising