ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం మొండి వైఖరి నశించాలి

ABN, First Publish Date - 2021-02-07T04:51:46+05:30

వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జీ. సునీత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), ఫిబ్రవరి 6: వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జీ. సునీత అన్నారు. శనివారం స్థానిక క్రాస్‌రోడ్డు వద్ద 565 జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని 70 రోజులుగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.   ఎల్‌ఐసీ, రైల్వే, బీపీసీఎల్‌, విశాఖ స్టీల్‌ వంటి సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబలకు అనుమతివ్వడం అంటే దేశ ప్రజలకు ద్రోహాన్ని తలపెట్టడమేనని దుయ్యబట్టారు.  రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి.వి. రమణయ్య, పీ. బాలకృష్ణయ్య, లక్ష్మీరెడ్డి, సుబ్బరాయుడు కె. అజిత, రత్నమ్మ, సీహెచ్‌ చిన ఓబయ్య, ఈశ్వరయ్య, సుబ్బరాయులు, గౌస్‌బాషా, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T04:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising