సచివాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ
ABN, First Publish Date - 2021-03-04T05:18:58+05:30
మండల పరిధిలోని పలు గ్రామాల సచివాలయాలు, ఉన్నతపాఠశాలల్లో బుధవారం జేసీ ప్రభాకర్రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.
కోట, మార్చి 3 : మండల పరిధిలోని పలు గ్రామాల సచివాలయాలు, ఉన్నతపాఠశాలల్లో బుధవారం జేసీ ప్రభాకర్రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. కేశవరం చిట్టేడు, చంద్రశేఖరపురం సచి వాలయాల్లో సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆయా సచివాయాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలికలకు మహిళల చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో భవాని, సీడీపీవో హేనాసూజన్, సూపర్వైజర్ కవిత, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-04T05:18:58+05:30 IST