ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాషువాను ఆదర్శంగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-07-25T04:28:51+05:30

విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షించిన కవి గుర్రం జాషువా ను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు.

జాషువా చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వర్ధంతి సభలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు

గూడూరురూరల్‌, జూలై 24: విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షించిన కవి గుర్రం జాషువా ను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు. స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీహాలులో శనివారం గుర్రం జాషువా సాహిత్యవేదిక ఆధ్వర్యంలో పద్మభూషణ్‌ గుఱ్రం జాషువా వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాషువా తన రచనల ద్వారా కవికోకిలగా, నవయుగ కవి చక్రవర్తిగా  గుర్తింపు పొందారన్నారు. గబ్బిలం, నేతాజీ, స్వయంవరం, బాబాజీ, ఫిరదోశి వంటి ఎన్నో కావ్యాలను రచించి సమాజంలో చైతన్యం తీసుకువచ్చారన్నారు. అనంతరం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దారు లీలారాణి, కమిషనర్‌ వైఓనందన్‌, సీడీపీవో ఆషాబేగం, ఆదూరు రత్నం, ఈముక్కల వెంకటరమణయ్య, మణి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T04:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising