చారిత్రక ఆనవాలు కనుమరుగు..
ABN, First Publish Date - 2021-10-24T04:45:21+05:30
అది.. చోళరాజుల కాలంలో నిర్మించిన మండపం.. చారిత్రక ఆనవాలు.. నేడు నెలకూలింది..
నేలకొరిగిన చోళరాజుల నాటి మండపం
అది.. చోళరాజుల కాలంలో నిర్మించిన మండపం.. చారిత్రక ఆనవాలు.. నేడు నెలకూలింది.. మన్నారుపోలూరులో చోళరాజుల కాలంనాటి అళఘు మల్లారికృష్ణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ మాడవీధుల్లో నాలుగు మండపాలు ఉండేవి. పూర్వం ఉత్సవాల్లో స్వామిని ఊరేగిస్తూ ఈ మండపాలలో దించి పూజలు చేసేవారని సమాచారం. ఆ మండపాలు శిథిలమైపోయి ఉన్నాయి. ప్రస్తుతం సూళ్లూరుపేట - శ్రీకాళహస్తి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ మండపం అడ్డుగా ఉందని శనివారం కూల్చివేశారు. చారిత్రక ఆధారమైన మండపం నేలమట్టంపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన చెందారు.
సూళ్లూరుపేట
Updated Date - 2021-10-24T04:45:21+05:30 IST