గురువులకు చేయూత
ABN, First Publish Date - 2021-05-18T03:23:57+05:30
పట్టణంలోని అమరావతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.1500 విలువైన నిత్యా
పొదలకూరు, మే 17 : పట్టణంలోని అమరావతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.1500 విలువైన నిత్యావసర వస్తువులను పూర్వవిద్యార్థుల సాయంతో సోమవారం అందచేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కె.సురేష్, పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మిగిలిగిన సిబ్బందికి కూడా ఆ్వరలోనే నిత్యావసర వస్తువులను అందచేస్తామని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం కూడా ప్రైవేటు కళాశాలల, పాఠశాలల అధ్యాపకులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-05-18T03:23:57+05:30 IST