ఆటో బోల్తా: నలుగురికి గాయాలు
ABN, First Publish Date - 2021-01-22T05:09:42+05:30
పట్టణంలోని ఎన్ఎ్సఆర్ కాలనీ సమీపంలో గురువారం రాత్రి ఆటో బోల్తాకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి.
నాయుడుపేట టౌన్, జనవరి 21 : పట్టణంలోని ఎన్ఎ్సఆర్ కాలనీ సమీపంలో గురువారం రాత్రి ఆటో బోల్తాకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. మండలంలోని కాపులూరుకు చెందిన ఆటో నాయుడుపేట పట్టణం నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని బయలుదేరింది. ఎన్ఎ్సఆర్ కాలనీకి సమీపంలోకి రాగానే కుక్క అడ్డురావడంతో తప్పించబోయి ఆటో బోల్తా కొట్టింది. అందులో ఉన్న సుబ్రహ్మణ్యం, భారతీ, నరసమ్మ, రంగయ్యలకు గాయాలు అయ్యాయి. వారిని 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-01-22T05:09:42+05:30 IST