జేఎల్ఎంలకు సన్మానం
ABN, First Publish Date - 2021-06-14T04:46:44+05:30
విద్యుత్శాఖలో జూనియర్ లైన్మెన్లుగా ఎంపికైన 18 మందిని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆదివారం సన్మానించారు. నెల్లూరు బాలాజీనగర్లోని దామవరపు చిన్నమ్మ స్మారకభవనంలో ఈ కార్యక్రమం జరిగింది.
నెల్లూరు(జడ్పీ), జూన్ 13 : విద్యుత్శాఖలో జూనియర్ లైన్మెన్లుగా ఎంపికైన 18 మందిని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆదివారం సన్మానించారు. నెల్లూరు బాలాజీనగర్లోని దామవరపు చిన్నమ్మ స్మారకభవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు మాట్లాడుతూ 2011, 12లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయగా 2014లో నియామకాలు జరిగాయన్నారు. వాటిని అమలు చేయకుండా అడ్డంకులు ఏర్పడడంతో న్యాయపోరాటాలు చేసి ఉద్యోగ నియామకాలను సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్కుమార్, యూఈఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జాకీర్హుస్సేన్, పాల్గొన్నారు.
Updated Date - 2021-06-14T04:46:44+05:30 IST