భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి
ABN, First Publish Date - 2021-10-29T04:42:44+05:30
మండలంలో జగనన్న శాశ్వత భూహక్కుల పథకం కింద ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వేకు ఆయా గ్రామాల్లోని రైతులు సహకరించాలని నాయుడుపేట ఆర్డీవో సరోజిని కోరారు.
ఆర్డీవో సరోజిని వెల్లడి
పెళ్లకూరు, అక్టోబరు 28 : మండలంలో జగనన్న శాశ్వత భూహక్కుల పథకం కింద ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వేకు ఆయా గ్రామాల్లోని రైతులు సహకరించాలని నాయుడుపేట ఆర్డీవో సరోజిని కోరారు. మండలంలోని ఊడిపూడి గ్రామంలో గురువారం రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడుతూ గ్రామాల్లో సర్వే చేసేటప్పుడు రైతులు పొలాల వద్దకెళ్లి తమ భూములు ఎలా సంక్రమించాయన్న విషయమై సర్వేయర్లకు డాక్యుమెంట్లు సమర్పిం చాలన్నారు. సమావేశంలో తహసీల్దారు కటారి జయజయరావు, డివిజన్ ఇన్చార్జి సర్వేయర్ ప్రసాద్, సర్వేయర్లు సుప్రజ, సూర్య, వీఆర్వో రవిచంద్ర, పంచాయతీ కార్యదర్శి యాస్మీన్, సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్రప్రసాద్రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T04:42:44+05:30 IST