డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
ABN, First Publish Date - 2021-02-28T03:32:52+05:30
: స్థానిక
కోవూరు, ఫిబ్రవరి27 : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో శనివారం విద్యార్ధులు రక్తదానం చేశారు. ఎన్ఎస్ఎస్, రెడ్రిబ్బన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సీపీ లక్ష్మీప్రసూన మాట్లాడుతూ విద్యార్ధులు కరోనా సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు మధుసూదనరావు, కే రవిచంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మధు, డాక్టర్ లావణ్య తదితరులు మాట్లాడారు.
Updated Date - 2021-02-28T03:32:52+05:30 IST