నిత్యావసరాల ధరలు నియంత్రించండి
ABN, First Publish Date - 2021-06-15T07:38:24+05:30
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆ ధరలను నియంత్రించాలని కోరుతూ దళిత సంఘర్షణ సమితి నాయకులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు.
దళిత సంఘర్షణ సమితి ధర్నా
నెల్లూరు(హరనాథపురం), జూన్ 14 : నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆ ధరలను నియంత్రించాలని కోరుతూ దళిత సంఘర్షణ సమితి నాయకులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ కొందరు వ్యాపారులు కరోనాను సాకుగా చూపి నిత్యావసర సరుకుల కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీంతో సామా న్యులపై పెనుభారం పడుతోందన్నారు. వంట నూనె, కందిపప్పు, పెసర పప్పు, మినపప్పు ధరలు భారీగా పెరిగాయన్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంచిపాక రత్నం, బిళ్ళా మస్తానయ్య, పీ దాసు, దర్శిగుంట రమణయ్య, పీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-15T07:38:24+05:30 IST