ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-12-27T04:29:53+05:30

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు కావడంపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడ, డిసెంబరు 26 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు  కావడంపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని బాలకృష్ణాపురంకుప్పం, కాశీంగాడుకుప్పం గ్రామాలకు చెందిన మత్స్యకార మహిళలు గుమ్మిడిపూడిలో చేపలు అమ్ముకుంటుంటారు. రోజులాగే గత 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఆరంబాకం నుంచి ఆటోలో గుమ్మిడిపూడికి బయలుదేరారు. మార్గ మధ్యంలో రామాపురంకుప్పం వద్ద ముందు వెళ్తున్న లారీ సడన్‌బ్రేక్‌ వేయడంతో ఆటో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దేవమ్మ, అంజలి  తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన 108 వాహనం క్షతగాత్రులను గుమ్మిడిపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-27T04:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising