కరోనా బాధిత పిల్లలకు సాయం
ABN, First Publish Date - 2021-06-21T03:29:05+05:30
కరోనా బారిన పడి ఇటీవల మృతి చెందిన మండలంలోని బిరుదవోలు గ్రామ వాసి బడుగు యానాదయ్య పిల్లలకు సర్వేపల్లి నియోజకవర్గ జనసే
పొదలకూరు(రూరల్), జూన్ 20 : కరోనా బారిన పడి ఇటీవల మృతి చెందిన మండలంలోని బిరుదవోలు గ్రామ వాసి బడుగు యానాదయ్య పిల్లలకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు ఆదివారం ఆర్థిక సాయం అందించారు. తల్లితండ్రుల మృతితో అనాధలైన లోక చైతన్య, అవినాష్లను వారి గ్రామానికి వెళ్లి కలిసి రూ.10వేలు నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొబ్బిలి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షలు బాండులను సత్వరం అందచేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-06-21T03:29:05+05:30 IST