ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABN, First Publish Date - 2021-05-18T03:21:01+05:30

కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించిందని, కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా

కసుమూరులో కర్ఫ్యూను పరిశీలిస్తున్న ఎస్‌ఐ కరీముల్లా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, మే 17 : కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించిందని, కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ షేక్‌ కరీముల్లా హెచ్చరించారు. మండలంలోని కసుమూరులో అమలు అవుతున్న కర్ఫ్యూను సోమవారం ఆయన తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12  వరకు దుకాణాలు తెరచుకోవచ్చని, ఆ తర్వాత మూసివేయాలన్నారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదన్నారు. కరోనా బారిన పడకుండా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, సామాజికదూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడం వంటి జాగ్రత్త చర్యలు పాటించాలని  కోరారు. ఆయన వెంట కానిస్టేబుల్‌ రామకృష్ణ  ఉన్నారు.


Updated Date - 2021-05-18T03:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising